ప్రతి రోజూ పాలు తాగడం చాలా ఆరోగ్యం అని మనకి తెలుసు . అయితే పాలు , తేనె కలుపుకుని తాగడం వల్ల పోషక విలువలు ఎక్కువగా మనకి చేరుతాయి .
మామూలుగా పాలు , తేనే విడివిడిగానే చాలా మేలు చేస్తాయి . ఇలా ఈ రెండిటినీ కలిపి తీసుకోవడం వల్ల మరింత ప్రయోజనం కలుగుతుంది .
మామూలుగా తేనే తీసుకోవడం వల్ల జీర్ణ కోశం లో నుంచి మంచి బ్యాక్టీరియా పెరుగుతుంది . పాల లో కొన్ని చుక్కల తేనె కలుపుకొని తాగడం వల్ల జీర్ణక్రియ మెరుగుపడటం తో కాక బ్లోటింగ్ , గ్రామ్స్ వంటి సమస్యలు తగ్గుతాయి .
రాత్రి పడుకునే ముందు కనుక పాలు తేనె కలిపి తీసుకుంటే మెదడు నుంచి శరీరానికి అంతా బాగుంటుంది అనే సిగ్నల్ ఒకటి వెళుతుంది . దీని మూలంగా హాయిగా నిద్ర పడుతుంది .
కాబట్టి రాత్రులు సరిగ్గా నిద్ర పట్టట్లేదు అనుకునే వాళ్ళు దీనిని తీసుకుంటే మంచి నిద్రని పొందొచ్చు .
పాల లో కాల్షియం సమృద్ధిగా ఉంటుంది . అయితే తేనె లో కలిపి పాలను తీసుకోవడం వల్ల ఈ కాల్షియంని బాగా అది లాగేసుకుంటుంది .
వయసు పై బడిన పెద్ద వారికి ఇది చాలా మంచిది . గోరు వెచ్చటి పాలు . తేనె తీసుకోవడం వల్ల గొంతు లో ఉండే బ్యాక్టీరియా తొలగిపోతుంది . దీనితో శ్వాసకోశ సమస్యలు కూడా రాకుండా ఉంటాయి .
ఏకాగ్రత పెరగడానికి కూడా ఇది మంచి చిట్కా . చల్లని పాలలో తేనె కలిపి తాగడం వల్ల ఏకాగ్రత బాగా పెరుగుతుంది . అలాగే శారీరకంగా , మానసికంగా కూడా అవసరమైన సామర్థ్యం ఏర్పడుతుంది .
ఒత్తిడి ఎక్కువగా ఉన్నప్పుడు పాలు తేనే తాగడం వల్ల సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదలవుతుంది . ఈ హార్మోన్ వల్ల ఒత్తిడి తగ్గుతుంది .